టర్కీ నైట్ క్లబ్ దాడిలో 8మంది అరెస్ట్
- January 02, 2017
నైట్ క్లబ్ ఉగ్రదాడిలో ఎనిమిది మంది అనుమానితులను టర్కీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రీనా నైట్ క్లబ్ లోకి దూసుకువచ్చిన ఆగంతకుడు 39 మందిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. దాడిని తామే జరిపినట్లు ఐసిస్ ప్రకటించింది. కాల్పుల అనంతరం దుండగుడు ఉజ్బెకిస్ధాన్ లేదా కజకిస్ధాన్ కు పారిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
టర్కీలో ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇరాక్ లోని 103 ఐసిస్ స్ధావరాలపై సేనలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 22మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు టర్కీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ తెలిపారు. ఉగ్రదాడిలో మరణించిన వారిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. అయితే, క్లబ్ కు కూతవేటు దూరంలో పోలీసు స్టేషన్ ఉన్నా కాల్పుల అనంతరం దుండగుడు ఎలా పరారయ్యాడు అనే విషయంపై మాత్రం టర్కీ ప్రభుత్వం ఎలాంటి విషయాలు వెల్లడించలేదు.కాల్పుల అనంతరం తుపాకీని పారేసిన దుండగుడు జన సమూహంలో కలిసిపోయి తప్పించుకున్నట్లు ఓ రిపోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







