పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం నజరానా
- January 02, 2017
రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు గతంలో ప్రకటించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం నజరానా అందజేసింది. నగరంలోని షేక్ పేట్లో ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది జరిగిన ఒలింపిక్స్ లో తెలుగమ్మాయి పీవీ సింధు రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిరస్మరణీయ విజయం తర్వాత సింధుకు 5 కోట్ల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్లో ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని.. ఆమె చేస్తానంటే తగిన ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
రియో నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన వెంటనే సింధును కేసీఆర్ సన్మానించి చెక్ అందజేశారు. ఇప్పుడు ఇంటి స్థలాన్ని కేటాయించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







