బ్యాంకాక్లో ఘోర రోడ్డు ప్రమాదం...25 మంది మృతి
- January 02, 2017
కొత్త సంవత్సరం రెండో రోజే థాయ్ల్యాండ్ రాజధాని బ్యాంకాక్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మినీ వ్యాన్ అదుపు తప్పి ట్రక్కును ఢీకొన్న దుర్ఘటనలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మినీ వ్యాన్లో 13 మంది, పికప్ ట్రక్కులో కిక్కిరిసి 12 మంది ఉన్నారు. మినీ వ్యాన్ డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ట్రక్కులో దూసుకుపోయింది. రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు కొందరు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ దారుణ ఘటన థాయల్యాండ్లో ప్రమాదకర పరిస్థితులపై మరో హెచ్చరికలాంటిదని నిపుణులు అంటున్నారు.
గత ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం థాయ్లో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారి సంఖ్య చూస్తే.. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. కొత్త సంత్సరం ప్రారంభంలోనూ, ఏప్రిల్లో వచ్చే మతపరమైన పండుగ సమయంలోనూ రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ రెండు వారాలను 'మోస్ట్ డెడ్లీ వీక్స్'గా వ్యవహరిస్తుంటారు.
నగరాల నుంచి లక్షల సంఖ్యలో శ్రమజీవులు స్వగ్రామాలకు వెళ్లి వచ్చే రోజులివి. కొత్త ఏడాది సందర్భంగా ఇచ్చిన సెలవుల్లో నాలుగో రోజు అంటే ఆదివారం నాటికి థాయ్ల్యాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 280 మరణించారు. ఈ సంఖ్య గత ఏడాది కంటే పది శాతం ఎక్కువ.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







