సలామ్ ఎయిర్ టిక్కెట్ సేల్స్ ప్రారంభం ..
- January 03, 2017
ఒమన్ తొలి బడ్జెట్ ఎయిర్లైన్ సలామ్ ఎయిర్ టిక్కెట్ సేల్స్ని ప్రారంభించింది. సలాలా మరియు మస్కట్ మధ్య ప్రయాణానికిగాను టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. జనవరి 30న విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. మస్కట్ - దుబాయ్ మధ్య విమానాలు ఫిబ్రవరి మధ్యలో ప్రారంభం కానున్నాయి. సలామ్ ఎయిర్ వెబ్సైట్ ద్వారా, అలాగే పలు ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా టిక్కెట్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. సలామ్ ఎయిర్ ఛైర్మన్ ఖాలిద్ అల్ యహ్మాది మాట్లాడుతూ, సలామ్ ఎయిర్ టిక్కెట్ల అమ్మకాల్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఒమన్ అభివృద్ధిలో తమ సంస్థ కూడా భాగం పంచుకుంటుందని ఆయన చెప్పారు. సలామ్ ఎయిర్ చీఫ్ ఫ్రాంకోయిస్ బౌటెల్లిర్ మాట్లాడుతూ, అతి తక్కువ ధరలకే విమాన ప్రయాణాన్ని తాము అందుబాటులోకి తెచ్చామని, ముందు ముందు మరిన్ని ఆకర్షణీయంగా తమ సర్వీసుల్ని ప్రయాణీకులకు అందజేస్తామని వెల్లడించారు. లైట్, ఫ్రెండ్లీ మరియు ఫ్లెక్సీ అనే మూడు ఆప్షన్స్ని సలామ్ ఎయిర్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. లగేజ్కి అనుగుణంగా ఈ ప్యాకేజీలు ఉంటాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







