కుటుంబంలో 10మందిని చంపి తానూ ఆత్మహత్య యూపీలో దారుణం....

- January 05, 2017 , by Maagulf
కుటుంబంలో 10మందిని చంపి తానూ ఆత్మహత్య యూపీలో దారుణం....

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది.  అమేథీలోని మహ్నోవా ప్రాంతంలో ఉంటున్న 45 ఏండ్ల వయస్సున్న జమాలు తమ కుటుంబంలోని 12 మందికి పురుగుల మందు తాగించి తరువాత వారిలో 10 మందిని నరికి చంపి తానూ ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతులలో 8మంది పిల్లలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.  కొన ఊపిరితో ఉన్న ఇద్దరిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.  అయితే జమాలు ఎందుకింత అఘాయిత్యానికి పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది.  ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com