'శాతకర్ణి' ప్రత్యేక ప్రదర్శనకు కేసీఆర్!...
- January 06, 2017
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ శుక్రవారం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రీమియర్ షోకు రావాల్సిందిగా ఆహ్వానించగా..కేసీఆర్ అంగీకరించారని బాలకృష్ణ తెలిపారు. .
'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంపై కేసీఆర్ ముందు నుంచీ ఆసక్తి కనబరుస్తున్నారు.
బాలకృష్ణ ఆహ్వానం మేరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి హాజరై కొబ్బరికాయ కొట్టారు. తెలుగుజాతి గర్వించదగ్గ శాతకర్ణి కథను తెరకెక్కించడం గర్వకారణమంటూ బాలకృష్ణను అభినందించారు. దీంతో పాటు ఈ సినిమాను తొలుత తనకే చూపించాలని కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలోనే సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ..
కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ప్రత్యేక ప్రదర్శనకు ఆహ్వానించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







