'శాతకర్ణి' ప్రత్యేక ప్రదర్శనకు కేసీఆర్!...
- January 06, 2017
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ శుక్రవారం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రీమియర్ షోకు రావాల్సిందిగా ఆహ్వానించగా..కేసీఆర్ అంగీకరించారని బాలకృష్ణ తెలిపారు. .
'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంపై కేసీఆర్ ముందు నుంచీ ఆసక్తి కనబరుస్తున్నారు.
బాలకృష్ణ ఆహ్వానం మేరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి హాజరై కొబ్బరికాయ కొట్టారు. తెలుగుజాతి గర్వించదగ్గ శాతకర్ణి కథను తెరకెక్కించడం గర్వకారణమంటూ బాలకృష్ణను అభినందించారు. దీంతో పాటు ఈ సినిమాను తొలుత తనకే చూపించాలని కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలోనే సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ..
కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ప్రత్యేక ప్రదర్శనకు ఆహ్వానించారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









