హీరోయిన్గా రానున్న మరో యాంకర్
- January 06, 2017
బుల్లి తెరపై వివిధ ప్రోగ్రాంలకు యాంకర్లుగా పని చేస్తున్నవారు ఈ మధ్య సినిమా హీరోయిన్లుగా అదరగొడుతున్నారు. అవకాశం ఇవ్వాలే కాని తమ సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. జబర్దస్త్ యాంకర్లు అనసూయ, రెష్మిగౌతమ్ ఈ కోవలోకే వస్తారు. మొదట యాంకర్లుగా ఉన్న వీరు, 'సోగ్గాడే చిన్నినాయనా'తో అనసూయ, గుంటూరు టాకీసుతో రష్మి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే రెష్మి కొంత వరకు సక్సెస్ అవగా, అనసూయకు మాత్రం కలిసి రాలేదు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా తన అంద చందాలతో కుర్రకారును చిర్రెత్తించిన రెష్మి తర్వాత కూడా కొనసాగుతుంది. కాని ఏజ్ కాస్త ఎక్కువగా కనిపించిందో ఏమో కాని అనసూయను ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. అందుకేనేమో ఈ మధ్య సినిమాల నుంచి కూడా కాస్త మాత్రం వెనక్కి తగ్గింది.ఏదేమైనా ఇదే కోవలో మరో యాంకర్ లాస్య కూడా వచ్చి చేరింది. నిజానికి అనసూయ, రష్మితో పోలిస్తే ట్రెడిషనల్గానే ఎక్కువగా కనిపించే లాస్య ఆకట్టుకునే స్మయిల్, ఎట్రాక్ట్ చేసే ఫిజిక్తో హీరోయిన్ అవకాశం కొట్టేసింది. ఆ సినిమా పేరు 'రాజా మీరు కేక'. రేవంత్, నోయల్, మిర్చి హేమంత్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు.
యాంకర్ నుంచి హీరోయిన్గా రష్మి, అనసూయ తర్వాత వస్తున్న లాస్య ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







