భారత్ టార్గెట్ గా చైనా మరో దుస్సాహసం
- January 06, 2017
భారత్ టార్గెట్ గా చైనా మరో దుస్సాహసం చేసింది. భారత్ కు సమీపంలో పాకిస్తాన్ లో సబ్ మెరైన్ నిర్మించింది. హిందూ మహాసముద్ర జలాల్లో చైనా న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉన్నాయనడానికి గట్టి ఆధారం లభించింది. గతేడాది మేలో పాకిస్థాన్లోని కరాచీ హార్బర్లో చైనాకు చెందిన న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ ఉన్నట్లు గూగుల్ ఎర్త్ ఇమేజ్ స్పష్టంచేసింది. ఈ సబ్మెరైన్కు చెందిన ఫొటోను మొదటగా శాటిలైట్ ఇమేజరీ ఎక్స్పెర్ట్ గుర్తించింది. చైనాకు చెందిన తొలి న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ చైనీస్ నేవీ టైప్ 091 హాన్ క్లాస్కు చెందిన సబ్మెరైన్గా తేలింది.
సాంప్రదాయ సబ్మెరైన్లకు ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ పూర్తి విరుద్ధం. ఇవి చాలా తక్కువ ఇంధనంతో పనిచేయడం వల్ల ఎక్కువ కాలం నీటిలోపల ఆపరేషన్స్ నిర్వహించగలుగుతుంది. పైగా వీటి వేగం కూడా చాలా ఎక్కువ. గతంలోని చైనీస్ టైప్ 093 షాంగ్ క్లాస్ సబ్మెరైన్ కంటే ఎంతో ఎక్కువ సామర్థ్యం కలదని భారత నేవీ అధికారులు కూడా చెబుతున్నారు. హిందూ మహాసముద్ర జలాల్లో తమ సబ్మెరైన్లను మోహరించడం ద్వారా ఈ ప్రాంతంలో భారత్ ఆధిపత్యాన్ని చైనా ప్రశ్నిస్తోంది.
గత కొన్నేళ్లుగా హిందూ మహాసముద్ర జలాల్లో చైనీస్ సబ్మెరైన్లు ఉన్నట్లు ఇండియన్ నేవీ బలంగా విశ్వసిస్తోంది. హిందూ మహాసముద్ర జలాల్లోకి చైనీస్ సబ్మెరైన్లు రావాలంటే అది మలక్కా, లాంబోక్, సుందా జలసంధుల గుండానే సాధ్యమవుతుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో సబ్మెరైన్లు ఉపరితలంపైనే ప్రయాణించాల్సి ఉంటుంది. దీనిద్వారా భారత్లాంటి దేశాలకు చైనీస్ సబ్మెరైన్లను గుర్తించడం సులువవుతోంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







