మయన్మార్లో రోహింగ్యా ముస్లిం వర్గంపై దాడులు
- January 06, 2017
అమ్మ ఒడిలో ఉండాల్సిన పదహారు నెలల చిన్నారి బురదలో ఇలా విగతజీవుడిగా పడి ఉండడాన్ని చూస్తే హృదయం కలచి వేస్తుంది. చిన్నారి పేరు మహ్మద్ షొహాయత్. మయన్మార్లోని రఖైన్ ప్రాంతంలో నివసిస్తున్న రోహింగ్యా వర్గానికి చెందిన జాఫర్ ఆలం కుమారుడు. రోహింగ్యా ముస్లిం వర్గంపై జరుగుతున్న దాడుల నుంచి తప్పించుకునేందుకు ఆలం కుటుంబం పడవలో బంగ్లాదేశ్కు బయలు దేరడానికి సిద్దమైంది. విషయం తెలుసుకున్న మయన్మార్ పోలీసులు అక్కడికి చేరుకుని కాల్పులు ప్రారంభించారు. బోటు నడిపేవారు కాల్పులనుంచి తప్పించుకునే తొందరలో శరణార్థులందరినీ ఎక్కించుకుని బయల్ధేరారు. పరిమితికి మించిన బరువుతో బయల్ధేరిన పడవ గమ్యం చేరకముందే నాఫ్ నదిలో మునిగిపోయింది. 16 నెలల షొహాయత, అతడి తల్లి, మేనమామ, మూడేళ్ళ సోదరుడు ఈ ప్రమాదంలో అసువులు బాశారు. షొహాయత శరీరం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. కన్నబిడ్డలు, భార్య కళ్ళముందే విగతజీవులుగా పడివుండడాన్ని జీర్ణించుకోలేక ఆ కన్న తండ్రి హృదయవిదారకంగా రోదిస్తున్నాడు. నేను మాత్రం ఎందుకు బతికి అని రోదిస్తున్నాడు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







