విక్రమ్ సినిమా తన శరీరం నుంచి చాలా డిమాండ్ చేస్తోంది..అఖిల్
- January 07, 2017
విక్రమ్ సినిమా తన నుంచి చాలా డిమాండ్ చేస్తోందని హీరో అక్కినేని అఖిల్ అన్నారు. 'అఖిల్' తర్వాత ఆయన కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం కసరత్తులు ప్రారంభించినట్లు అఖిల్ ట్వీట్ చేశారు. నేటి నుంచి కొత్త వ్యాయామ షెడ్యూల్, డైట్ ఫాలోఅవుతున్నట్లు పేర్కొన్నారు. తర్వాతి సినిమా కోసం ఫిట్ అవ్వాల్సిన సమయమని పేర్కొన్నారు. విక్రమ్ సినిమా తన శరీరం నుంచి చాలా డిమాండ్ చేస్తోంది.. చాలా ఉత్సుకతగా ఉందని ట్వీట్ చేశారు. .
ఈ చిత్రంలో తమిళ నటి మేఘ ఆకాష్ను కథానాయికగా అనుకుంటున్నట్లు సమాచారం.
విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన '24' చిత్రం ఇటీవల విడుదలైంది. సూర్య, సమంత, నిత్యామేనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







