జీఆర్ఈఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి
- January 08, 2017
అక్నూర్: జమ్ములోని అక్నుర్ సెక్టార్లోని జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అక్కడ సివిల్ పనులు చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. జీఆర్ఈఎఫ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాతృసంస్థ. ఈ సంస్థ సరిహద్దుల్లోని రోడ్లు, భవనాలను నిర్వహిస్తుంటుంది. క్యాంపులోని జూరియన్ ప్రాంతంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు తుపాకులతో మారుణహోమానికి తెగబడ్డారు. ఈ ప్రాంతం జమ్మూకు 55 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ సరిహద్దులో ఉంది. ఆ ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకుని.. అక్కడకు వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధించి ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.
ఇటీవల కాలంలో జమ్ము-కశ్మీర్లో ఉగ్రదాడులు పెచ్చరిల్లాయి. నవంబర్ చివరి వారంలో జరిగిన దాడిలో ఇద్దరు మేజర్లతో సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







