విడుదలైన 'గుంటూరోడు' ట్రైలర్.!
- January 11, 2017
మంచు మనోజ్ కథానాయకుడిగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'గుంటూరోడు'. ఈ చిత్రం ట్రైలర్ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. హీరో మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ''గుంటూరోడు' ట్రైలర్.. చూసి మీ అభిప్రాయం చెప్పండి' అని ట్వీట్ చేశారు. మనోజ్ యాక్షన్తో కూడుకున్న ఈ ట్రైలర్ చక్కగా ఉందని నటులు రకుల్ప్రీత్ సింగ్, నిఖిల్ ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. చిత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. వీరికి మనోజ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజ్ఞా జైశ్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. శ్రీవరుణ్ అట్లూరి చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీ వసంత్ స్వరాలు సమకూరుస్తున్నారు. రాజేంద్రప్రసాద్, కోటా శ్రీనివాసరావు, రావు రమేశ్, పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







