తీవ్రవాదులను అణచివేసేందుకు జర్మనీ చర్యలు...
- January 12, 2017
- ఎలక్ట్రానిక్ ట్యాగ్లతో గుర్తింపునకు యత్నాలు
బెర్లిన్ : గతేడాది బెర్లిన్ క్రిస్మస్ మార్కెట్లో దాడి జరిగిన నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్, పర్యవేక్షణా చట్టాలను ప్రక్షాళన చేయాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తోంది. జర్మనీలో ఆశ్రయం కోరేవారిని, ఆశ్రయం పొందలేక తిరిగి వెళ్ళేవారిని, రాజకీయ తీవ్రవాదులను పర్యవేక్షించేందుకు ఎలక్ట్రానిక్ ట్యాగ్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని న్యాయ శాఖ మంత్రి తెలిపారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన రాజకీయ అసమ్మతివాదులకు కూడా ఈ ట్యాగ్లు వర్తిస్తాయని తెలిపారు. రాడికల్ భావాలతో వ్యవహరించేవారిని కనుగొని వారు హింసాత్మక తీవ్రవాదం వైపు మళ్ళకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.
గత ఏడాది డిసెంబరు 19న బెర్లిన్ మార్కెట్లో జరిగిన దాడిలో 12మంది మరణించగా, 49మంది గాయపడ్డారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 16 నిఘా సంస్థల స్థానే ఒకే ఒక జాతీయ సంస్థను తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







