తీవ్రవాదులను అణచివేసేందుకు జర్మనీ చర్యలు...

- January 12, 2017 , by Maagulf
తీవ్రవాదులను అణచివేసేందుకు జర్మనీ చర్యలు...

- ఎలక్ట్రానిక్‌ ట్యాగ్‌లతో గుర్తింపునకు యత్నాలు 
బెర్లిన్‌ : గతేడాది బెర్లిన్‌ క్రిస్మస్‌ మార్కెట్‌లో దాడి జరిగిన నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్‌, పర్యవేక్షణా చట్టాలను ప్రక్షాళన చేయాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తోంది. జర్మనీలో ఆశ్రయం కోరేవారిని, ఆశ్రయం పొందలేక తిరిగి వెళ్ళేవారిని, రాజకీయ తీవ్రవాదులను పర్యవేక్షించేందుకు ఎలక్ట్రానిక్‌ ట్యాగ్‌లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని న్యాయ శాఖ మంత్రి తెలిపారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన రాజకీయ అసమ్మతివాదులకు కూడా ఈ ట్యాగ్‌లు వర్తిస్తాయని తెలిపారు. రాడికల్‌ భావాలతో వ్యవహరించేవారిని కనుగొని వారు హింసాత్మక తీవ్రవాదం వైపు మళ్ళకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.
గత ఏడాది డిసెంబరు 19న బెర్లిన్‌ మార్కెట్‌లో జరిగిన దాడిలో 12మంది మరణించగా, 49మంది గాయపడ్డారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 16 నిఘా సంస్థల స్థానే ఒకే ఒక జాతీయ సంస్థను తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com