ప్రపంచ సుందరి పోటీలకు సిక్కు యువతి..
- January 12, 2017
కౌలాలంపూర్ : మలేషియాలో జరగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో భారత సంతతి సిక్కు యువతి పాల్గొంటున్నారని పోటీల నిర్వాహకులు తెలిపారు. కిరణ్మీత ్కౌర్ బల్జీత్సింగ్ జసాల్ (20) గతేడాది మిస్యూనివర్స్ మలే షియా టైటిల్ సొంతం చేసుకున్నా రని చెప్పారు. ఈనెల30న మనీలాలో జరగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో ఆమె పాల్గొంటారని అన్నారు. జసాల్ కుటుంబ సభ్యులు కొన్నేండ్ల కిందట భారత్ నుంచి మలేషియాకు వచ్చి స్థిరపడ్డారు. ఆమె తల్లి రంజిత్ కౌర్ గతేడాది జరిగిన మిసెస్ మలేషియా టైటిల్ను సొంతం చేసుకున్నారు. జసాల్ సోదరీ రణ్మీత్ భారత్లోనే ఉంటూ రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో మెడిసిన్ చేస్తున్నారు.
చదువుతో పాటు మోడలింగ్ రంగంలోనూ ఆమె రాణిస్తున్నారు. జసాల్ రెండో సోదరి కిరణ్..ఇంటర్నేషన్ మెడికల్ యూనివర్సిటీలో డెంటిస్టు కోర్సు చదువుతున్నారు. జసాల్ చెల్లెలిద్దరూ బ్యూటీ క్వీన్స్ అంటూ సినీనటులు ఐశ్వర్యారారు (1994లో మిస్ వరల్డ్ టైటిల్ గ్రహీత ), సుష్మితా సేన్ ( 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ గ్రహీత ) కితాబిచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







