పన్నీర్‌సెల్వం భేటీ చంద్రబాబుతో...

- January 12, 2017 , by Maagulf
పన్నీర్‌సెల్వం భేటీ చంద్రబాబుతో...

అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం విమనాశ్రయానికి చేరుకున్న పన్నీర్‌కు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయిన పన్నీర్‌ సెల్వం తమిళనాడుకు తెలుగు గంగ నీటి పంపిణీ అంశంపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాజకీయ అంశాలను సైతం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com