'యు.ఏ.ఈ కి చెందిన మానవతా సేవ విదేశాల్లోనూ కొనసాగుతుంది'
- January 12, 2017
అబూధాబీ:యు.ఏ.ఈ కి చెందిన మానవతా రాయబారులు విదేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అలాగే ప్రపంచవ్యాప్తంగా సాయుధ విభేదాలు ఏర్పడినపుడు బాధితుల పక్షాన ఉండి సహాయం చేసి వారికి మద్దతు అందచేయడం కొనసాగుతుందని ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అథారిటీ బోర్డు ( ఇ ఆర్ సి ) చైర్మన్ డాక్టర్ హందాన్ అల్ మజ్రౌయి చెప్పారు. ఆఫ్గనిస్తాన్ లో ప్రాణాలు కోల్పోయిన యుఎఇకి చెందిన మానవతావాద కార్యకర్తల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన అల్ మజ్రౌయి మాట్లాడుతూ వారు అక్కడకు వెళ్లి విద్యా కేంద్రాలు, అనాధ శరణాలయాలు నిర్మించి ఆదుకోవాల్సిన వ్యక్తులను సహాయం చేసే సమయంలో నీతులు మరియు మతాలకు వ్యతిరేకంగా వారికి హాని జరగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు.యుద్ధం తరువాత ఆ దేశ పునర్నిర్మాణ ప్రక్రియలో ఆఫ్గనిస్తాన్ కు సహాయపడింది యుఎఇ అని చెప్పిన ఆయన ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అథారిటీ బోర్డు ( ఇ ఆర్ సి ) ద్వారా మానవతా దృక్పథంతో యుఎఇ నిర్వహించిన చరిత్ర గురించి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఆ దేశంలో ఆఫ్ఘన్లు కోసం నిర్మించిన పాఠశాలలు, ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, ఇళ్ళు మరియు అనాధ శరణాలయాలు నిర్మించేందుకు ఎంతో సాయం అందించిందని ఆయన గుర్తు చేశారు.యుఎఇ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదవారు, హాని జరిగిన ప్రజలకు యుద్ధంలో దెబ్బతిన్నఆఫ్ఘన్లకు అలాంటి సాయం అందించడం కొనసాగుతుందని అల్ మజ్రౌయి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







