'యు.ఏ.ఈ కి చెందిన మానవతా సేవ విదేశాల్లోనూ కొనసాగుతుంది'
- January 12, 2017
అబూధాబీ:యు.ఏ.ఈ కి చెందిన మానవతా రాయబారులు విదేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అలాగే ప్రపంచవ్యాప్తంగా సాయుధ విభేదాలు ఏర్పడినపుడు బాధితుల పక్షాన ఉండి సహాయం చేసి వారికి మద్దతు అందచేయడం కొనసాగుతుందని ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అథారిటీ బోర్డు ( ఇ ఆర్ సి ) చైర్మన్ డాక్టర్ హందాన్ అల్ మజ్రౌయి చెప్పారు. ఆఫ్గనిస్తాన్ లో ప్రాణాలు కోల్పోయిన యుఎఇకి చెందిన మానవతావాద కార్యకర్తల మరణానికి సంతాపం వ్యక్తం చేసిన అల్ మజ్రౌయి మాట్లాడుతూ వారు అక్కడకు వెళ్లి విద్యా కేంద్రాలు, అనాధ శరణాలయాలు నిర్మించి ఆదుకోవాల్సిన వ్యక్తులను సహాయం చేసే సమయంలో నీతులు మరియు మతాలకు వ్యతిరేకంగా వారికి హాని జరగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు.యుద్ధం తరువాత ఆ దేశ పునర్నిర్మాణ ప్రక్రియలో ఆఫ్గనిస్తాన్ కు సహాయపడింది యుఎఇ అని చెప్పిన ఆయన ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అథారిటీ బోర్డు ( ఇ ఆర్ సి ) ద్వారా మానవతా దృక్పథంతో యుఎఇ నిర్వహించిన చరిత్ర గురించి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఆ దేశంలో ఆఫ్ఘన్లు కోసం నిర్మించిన పాఠశాలలు, ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, ఇళ్ళు మరియు అనాధ శరణాలయాలు నిర్మించేందుకు ఎంతో సాయం అందించిందని ఆయన గుర్తు చేశారు.యుఎఇ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదవారు, హాని జరిగిన ప్రజలకు యుద్ధంలో దెబ్బతిన్నఆఫ్ఘన్లకు అలాంటి సాయం అందించడం కొనసాగుతుందని అల్ మజ్రౌయి చెప్పారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







