జనవరి 28న లండన్ లో 'టాక్' ఆవిర్భావం
- January 14, 2017
యూకే లో నివసిస్తున్న ప్రవాస తెలంగాణ వారందరిని తెలంగాణ అసోసియేషణ్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్(TAUK) ఆవిర్భావ జనవరి 28న లండన్లో జరగనుంది. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టాక్ ఆవిర్భవ పోస్టర్ను ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి ఆవిష్కరించారు. యుకేలోని తెలంగాణ బిడ్డలందరిని ఒకేతాటిపైకి తెచ్చేందుకే టాక్ ఏర్పాటుచేశామని సంస్థ ప్రతినిధి నవీన్ రెడ్డి అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో తమవంతు పాత్ర పోషించామని…నేడు అదే స్పూర్తితో బంగారు తెలంగాణలో భాగస్వాములవుతామని తెలిపారు. టాక్ ద్వారా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతామన్నారు. టాక్ ద్వారా రానున్న కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో బంగారు తెలంగాణ సాధన దిశగా తమ సహకారం అందిస్తామన్నారు.
ఈ నెల 28న లండన్లో జరిగే ఆవిర్భావ సభకు ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి, కట్టా శేఖర్ రెడ్డితో పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు మధుసూదన్ రెడ్డి, శ్వేతా, రాజ్ కుమార్ శానబోయిన, ఓయూ జాక్ చైర్మన్ కరాటే రాజు, టీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి , మల్లేష్ యాదవ్, ప్రవీణ్ కుమార్, శశిధర్ చేబర్తి, వసుంధర, తెలంగాణ సోషల్ మీడియా నాయకులు కరుణాకర్ రెడ్డి, తెలంగాణ ఆజాద్ ఫోర్స్ నాయకులు తిరుమందాస్ గౌడ్ మరియు తెలంగాణ సామాజిక నాయకులు ఫణికుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







