జనవరి 28న లండన్ లో 'టాక్' ఆవిర్భావం
- January 14, 2017
యూకే లో నివసిస్తున్న ప్రవాస తెలంగాణ వారందరిని తెలంగాణ అసోసియేషణ్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్(TAUK) ఆవిర్భావ జనవరి 28న లండన్లో జరగనుంది. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టాక్ ఆవిర్భవ పోస్టర్ను ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి ఆవిష్కరించారు. యుకేలోని తెలంగాణ బిడ్డలందరిని ఒకేతాటిపైకి తెచ్చేందుకే టాక్ ఏర్పాటుచేశామని సంస్థ ప్రతినిధి నవీన్ రెడ్డి అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో తమవంతు పాత్ర పోషించామని…నేడు అదే స్పూర్తితో బంగారు తెలంగాణలో భాగస్వాములవుతామని తెలిపారు. టాక్ ద్వారా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతామన్నారు. టాక్ ద్వారా రానున్న కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో బంగారు తెలంగాణ సాధన దిశగా తమ సహకారం అందిస్తామన్నారు.
ఈ నెల 28న లండన్లో జరిగే ఆవిర్భావ సభకు ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి, కట్టా శేఖర్ రెడ్డితో పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు మధుసూదన్ రెడ్డి, శ్వేతా, రాజ్ కుమార్ శానబోయిన, ఓయూ జాక్ చైర్మన్ కరాటే రాజు, టీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి , మల్లేష్ యాదవ్, ప్రవీణ్ కుమార్, శశిధర్ చేబర్తి, వసుంధర, తెలంగాణ సోషల్ మీడియా నాయకులు కరుణాకర్ రెడ్డి, తెలంగాణ ఆజాద్ ఫోర్స్ నాయకులు తిరుమందాస్ గౌడ్ మరియు తెలంగాణ సామాజిక నాయకులు ఫణికుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









