రేపే జీఎస్‌టీపై కీలక సమావేశం

- January 15, 2017 , by Maagulf
రేపే జీఎస్‌టీపై కీలక సమావేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని వస్తు, సేవలపన్ను(జీఎస్‌టీ) కౌన్సిల్‌ కీలక సమావేశం సోమవారం జరగనుంది. జీఎస్‌టీ నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆధికార పంపిణీ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. కౌన్సిల్‌ ఏర్పడిన తర్వాత అధికారాల పంపిణీపై సమావేశం కావడం ఇది తొమ్మిదోసారి. ఈ అన్ని సమావేశాల్లో ఇదే అతిపెద్ద అజెండా ఉంటోంది. జనవరి 4న జరిగిన సమావేశంలో రూ.1.5కోట్లు టర్నోవర్‌ ఉన్న అసెసీలపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఏకపక్షంగా నియంత్రణ ఉండాలని పట్టుబట్టాయి. కానీ కేంద్రం కూడా అధికారాలను నిట్ట నిలువునా చీల్చేందుకు సిద్ధంగా లేదు. మరోపక్క జైట్లీ కూడా ఒక్కో ట్యాక్స్‌ చెల్లింపుదారుడిని రెండు ఏజన్సీలతో మదింపు చేయడానికి సుమఖంగా లేరు. దీనిపై గత వారం జైట్లీ మాట్లాడుతూ ఈ సమావేశంలోనైనా చిక్కుముడులు వీడి జీఎస్‌టీ ముందుకొస్తుదని భావిస్తున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com