రేపే జీఎస్టీపై కీలక సమావేశం
- January 15, 2017
కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని వస్తు, సేవలపన్ను(జీఎస్టీ) కౌన్సిల్ కీలక సమావేశం సోమవారం జరగనుంది. జీఎస్టీ నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆధికార పంపిణీ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత అధికారాల పంపిణీపై సమావేశం కావడం ఇది తొమ్మిదోసారి. ఈ అన్ని సమావేశాల్లో ఇదే అతిపెద్ద అజెండా ఉంటోంది. జనవరి 4న జరిగిన సమావేశంలో రూ.1.5కోట్లు టర్నోవర్ ఉన్న అసెసీలపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఏకపక్షంగా నియంత్రణ ఉండాలని పట్టుబట్టాయి. కానీ కేంద్రం కూడా అధికారాలను నిట్ట నిలువునా చీల్చేందుకు సిద్ధంగా లేదు. మరోపక్క జైట్లీ కూడా ఒక్కో ట్యాక్స్ చెల్లింపుదారుడిని రెండు ఏజన్సీలతో మదింపు చేయడానికి సుమఖంగా లేరు. దీనిపై గత వారం జైట్లీ మాట్లాడుతూ ఈ సమావేశంలోనైనా చిక్కుముడులు వీడి జీఎస్టీ ముందుకొస్తుదని భావిస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







