బహ్రెయిన్ లో పోలీసు అధికారులను హతమార్చిన ముగ్గురికి మరణశిక్ష

- January 15, 2017 , by Maagulf
బహ్రెయిన్ లో పోలీసు అధికారులను హతమార్చిన ముగ్గురికి మరణశిక్ష

 మనామా: ముగ్గురు పోలీసు అధికారులను హతమార్చిన  ముగ్గురిని దోషులుగా తేల్చిన తర్వాత  వారికి మరణశిక్షను ఈ ఆదివారం ఉదయం ( నేడు ) బహరేన్ అమలుచేసింది. రెండేళ్ల క్రితం దారుణ హత్యకు గురైన  యుఎఇ ఆర్మీ అధికారి మొదటి లెఫ్టినెంట్ తారిక్ అల్ షెహి సైతం ఆ నేరస్థులు బలికొన్నవారిలో ముగ్గురు అధికారులలో ఉన్నారు. తీవ్రవాద నేరాలను విచారించే ప్రాసిక్యూషన్ అధిపతి అహ్మద్ అల్ హమ్మది మాట్లాడుతూ, ఈ మరణశిక్షల ఒక కాల్పుల దళం మరియు ఒక న్యాయమూర్తి సమక్షంలో ఈ రోజు ఉదయం జరిగిందని తెలిపారు. ఈ ముగ్గురు నిందితులను తుపాకులతో కాల్చి చంపేటప్పుడు  ప్రజా విచారణ చట్టం ప్రతినిధి, జైలు వార్డెన్, ఒక వైద్యుడు మరియు ఒక బోధకుడు ఉన్నారు. చట్టబద్ధంగా సూచించిన విధానాలు కస్సాషన్ యొక్క తుది తీర్పు తర్వాత నిందితులకు మరణశిక్ష  అమలకు రంగం సిద్ధం అయ్యిందని అల్ హమ్మది తెలిపారు, అటార్నీ జనరల్  అందుకు అనుగుణంగా అనుగుణంగా దానిని అమలు జరపాలని పిలుపునిచ్చారు. మనామా రాజధాని శివార్లలో దయ్య  గ్రామంలో మార్చి 3 వ తేదీన  2014 న  ముగ్గురు పోలీసులని ఈ నిందితులు మట్టుపెట్టారు. 22 నెలల అంతరం గత సోమవారం, అల్ షెహి మరియు పోలీసు అధికారి మొహమ్మద్ రస్లాన్ మరియు ఎమ్మార్  అబ్దు ఆలీ మొహమ్మద్ చంపిన నేరాలలో కస్సాషన్ కోర్టు ఎదుట ముగ్గురు నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించడంతో వారిని దోషిగా నిర్ధారించింది మరణశిక్షని ఖరారు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com