రేపటి నుంచి ప్రారంభం కానున్న గనుల ప్రదర్శనలో పాల్గొననున్న 65 కంపెనీలు

- January 15, 2017 , by Maagulf
రేపటి నుంచి ప్రారంభం కానున్న గనుల ప్రదర్శనలో పాల్గొననున్న 65 కంపెనీలు

 మస్కట్: గనుల రంగంలో సమర్థవంతమైన పెట్టుబడిదారులకు ఒక ద్వారం తెరువడానికి మూడు రోజుల ఒమన్ మినరల్స్ & మైనింగ్ ఎగ్జిబిషన్ & కాన్ఫరెన్స్ సోమవారం నుండి ప్రారంభమవుతుంది. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద జరుగనున్నఈ ప్రదర్శనలో, ఒమన్, టర్కీ, సౌదీ అరేబియా, జర్మనీ, భారతదేశం, అమెరికా, దక్షిణ ఆఫ్రికా, చిలీ, ఈజిప్ట్, జోర్డాన్, యుఎఇ  బహరేన్, సింగపూర్, ఘనా, ఇటలీ, మొదలుగు దేశాలతో సహా15 దేశాల నుండి సుమారు 65 కంపెనీలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఒమన్ మినరల్స్ & మైనింగ్ ఎగ్జిబిషన్ & కాన్ఫరెన్స్  2,580 చదరపు మీటర్ల విస్తీర్ణ  ప్రాంతంలో నిర్వహించబడుతుంది. ఈ ప్రదర్శనకు ఖనిజ వనరులను సంస్థలు, మైనింగ్ మరియు అన్వేషణ పరికరాలు సంస్థలు, కన్సల్టెంట్లు, పాలరాయి మరియు గ్రానైట్ కంపెనీలు, భవన నిర్మాణ మెటీరియల్ సంస్థలుప్రభుత్వం మరియు ప్రభుత్వేతర సంస్థలు పాల్గొననున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com