రూ.2100కోట్లుతో ఈఫిల్టవర్ నవీకరణ
- January 15, 2017
పారిస్లోని ఈఫిల్ టవర్ అందం రెట్టింపు కానుంది. ఏటా దాదాపు 70 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తోన్న టవర్ అందాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు భారీగా నిధులు ఖర్చు చేయాలని పారిస్ నగర పాలకవర్గం నిర్ణయించింది. టవర్ నవీకరణతో పాటు.. సందర్శకుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 300మిలియన్ యూరోలు(రూ.2170 కోట్లు) ఖర్చు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2024 ఒలింపిక్స్ గేమ్స్.. 2025లో యూనివర్సల్ ఎగ్జిబిషన్కు పారిస్ నగరం వేదిక కానుంది. అపట్లోగా ఈఫిల్ టవర్ను అత్యద్భుతంగా తీర్చిదిద్ధేందుకు అక్కడి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
కేటాయించిన నిధుల్లో సగం టవర్ నవీకరణకే ఖర్చు చేయనున్నారట. ప్రస్తుతం వెలుగులు జిమ్ముతున్న విద్యుత్ దీపాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంతో పాటు.. లిఫ్టులకూ మరమ్మతులు చేస్తామని పారిస్ డిప్యూటీ మేయర్ ఫ్రాంకోయిస్ మార్టిన్స్ వెల్లడించారు. మరో వెయ్యి కోట్లు పర్యాటకుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు.. ఎండ.. వాన.. మంచుతో సందర్శకులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయనున్నారట. అలాగే.. గత రెండేళ్లలో ఫ్రాన్స్లో ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో భద్రతను మరింత మెరుగుపరచనున్నట్లు అధికాలు తెలిపారు. ఈ నెలాఖరులోగా పారిస్ కౌన్సిల్లో ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందే వీలుందట.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







