మోహన్ బాబు కార్ అద్దాలు ధ్వంసం చేసారు..

- January 17, 2017 , by Maagulf
మోహన్ బాబు కార్ అద్దాలు ధ్వంసం చేసారు..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు సంక్రాంతి రోజున చేదు అనుభవం ఎదురయ్యింది. సంక్రాంతి వేడుకుల్లో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా పుల్లయ్యగారి పల్లె కు తన కూతురు లక్ష్మి మంచు తో కలిసి వెళ్ళాడు. జల్లెకట్టు క్రీడను తిలకించేందుకు అక్కడికి చేరుకోగా , అతని కార్ అద్దాలు కొందరు ఆకతాయిలు ధ్వసం చేసారు..

ఇది అభిమానుల అత్యుత్సాహమా లేక, ఎవరైనా గిట్టని వాళ్లు కావాలనే కారు అద్దాలు పగులగొట్టారా అన్నది తెలియరాలేదు. ఈ విషయాన్ని లైట్ తీసుకున్న మోహన్ బాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆనందించారు. ఇక తన ఇద్దరి కొడుకుల చిత్రాలు వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్నాయి..విష్ణు లాక్కున్నోడు గా ఫిబ్రవరి 3 న వస్తుంటే , గుంటూరోడు గా మంచు మనోజ్ ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com