అబుధాబీ క్యాబ్స్ లో కెమెరాలు - పెరిగిన నిజాయితీ, భద్రతలు
- September 12, 2015
యూ. ఏ. ఈ. రాజధాని అబుధాబీలోని క్యాబ్ లలో CCTV కెమెరాలు, సౌండ్ రికార్డింగ్ సిస్టంల ఏర్పాటుపై క్యాబ్ డ్రైవర్లు మరియు ప్రయాణీకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం జూన్ నెలలో మొదలైన ఈ ప్రక్రియ జూన్ 2016 కల్లా పూర్తవుతుందని తెలియవచ్చింది. దీనివల్ల, ప్రమాదకరంగా లేదా వేగంగా డ్రైవ్ చేయడం, తద్వారా వచ్చే ప్రమాదాలను, నడిపేటపుడు మొబైల్ ఫోన్లలో మాట్లాడడం వంటి వాటిని కూడా నివారించడంలో ఉపయుక్తంగా ఉంది. ఈ విధానం ఏర్పాటుచేసిన నాటినుండి ఛార్జీలు చెల్లించకుండా వెళ్ళిపోయే వారు, వేచి ఉండమని ఇంకా రాకుండా ఉండేవరితో వారితో ఇబ్బందులు తప్పాయని, ప్రయాణీకుల వివాదాలు, దురుసుప్రవర్తన తగ్గిందని, తమ పని సులువైందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక భారతీయ డ్రైవర్ సంతోషిస్తుండగా,తమకు కూడా డ్రైవర్ల వల్ల వచ్చే ఫోన్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా నడపడం వంటి ప్రమాదాలు తప్పాయని జైనాబ్ హాష్మీ, స్యామ్ కెంట్ వంటి ప్రయాణీకులు సంతోషిస్తున్నారు. ట్రాన్స్ ఎ. డి. కి చెందిన అహ్మెద్ ముస్తఫా, ఈ సంవత్సరాంతానికి ఇంచుమించు 5000 క్యాబ్ లు CCTV సిస్టం ను కలిగిఉంటాయని, రాబోయే కొత్త కార్లలో ఎలాగూ ఇది ఇమిడి ఉంటుందని తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









