సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- April 19, 2026
యూఏఈః బలమైన సముద్ర అలల నుండి తన చెల్లెలిని, ఇద్దరు కజిన్లను కాపాడే ప్రయత్నంలో రాస్ అల్ ఖైమాలో 13 ఏళ్ల యూఏఈ బాలుడు నీట మునిగి చనిపోయాడు. ఏప్రిల్ 14న (మంగళవారం )సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని అతని తండ్రి తెలిపారు. మృతుడిని మహమ్మద్ అహ్మద్ బిన్ అమెర్ అల్ షెహీగా గుర్తించారు. పలువురు చిన్న పిల్లలతో సహా తన కుటుంబంతో కలిసి బీచ్కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.
తండ్రి చెప్పిన ప్రకారం.. పిల్లలు తీరం దగ్గర ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా వచ్చిన అలలు మరియు బలమైన ప్రవాహాలు వారిలో కొందరిని మరింత సముద్రంలోకి లాగేశాయి. పిల్లలలో అందరికంటే పెద్దవాడైన మహమ్మద్, పరిస్థితి విషమిస్తున్నట్లు గమనించి, అంతకు ముందే నీటి నుండి దూరంగా వచ్చేశాడు.
అయితే, తన ఏడేళ్ల చెల్లెలు మరియు ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు కజిన్లు ప్రవాహంలో మరింత లోపలికి వెళ్లారు. వారిని కాపాడటానికి అతను తిరిగి నీటిలోకి వెళ్లాడు. మహమ్మద్ తన చెల్లెలిని, కజీన్లు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చి, మునిగిపోకుండా కాపాడగలిగాడని అతని తండ్రి చెప్పారు.
అయితే, ఈ రక్షణ ప్రయత్నంలో మహమ్మద్ బాగా అలసిపోయాడు. అతను ఒడ్డుకు తిరిగి వచ్చేలోపే, అధిక మొత్తంలో సముద్రపు నీటిని మింగి, స్రృహ కోల్పోయాడని బంధువులు తెలిపారు. రెస్క్యూ బృందాలు అతడిని ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించాడని తండ్రి చెప్పారు. మహమ్మద్ సోదరి పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని, ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటన జరిగిన బీచ్లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









