సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- April 19, 2026
యూఏఈః బలమైన సముద్ర అలల నుండి తన చెల్లెలిని, ఇద్దరు కజిన్లను కాపాడే ప్రయత్నంలో రాస్ అల్ ఖైమాలో 13 ఏళ్ల యూఏఈ బాలుడు నీట మునిగి చనిపోయాడు. ఏప్రిల్ 14న (మంగళవారం )సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని అతని తండ్రి తెలిపారు. మృతుడిని మహమ్మద్ అహ్మద్ బిన్ అమెర్ అల్ షెహీగా గుర్తించారు. పలువురు చిన్న పిల్లలతో సహా తన కుటుంబంతో కలిసి బీచ్కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.
తండ్రి చెప్పిన ప్రకారం.. పిల్లలు తీరం దగ్గర ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా వచ్చిన అలలు మరియు బలమైన ప్రవాహాలు వారిలో కొందరిని మరింత సముద్రంలోకి లాగేశాయి. పిల్లలలో అందరికంటే పెద్దవాడైన మహమ్మద్, పరిస్థితి విషమిస్తున్నట్లు గమనించి, అంతకు ముందే నీటి నుండి దూరంగా వచ్చేశాడు.
అయితే, తన ఏడేళ్ల చెల్లెలు మరియు ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు కజిన్లు ప్రవాహంలో మరింత లోపలికి వెళ్లారు. వారిని కాపాడటానికి అతను తిరిగి నీటిలోకి వెళ్లాడు. మహమ్మద్ తన చెల్లెలిని, కజీన్లు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చి, మునిగిపోకుండా కాపాడగలిగాడని అతని తండ్రి చెప్పారు.
అయితే, ఈ రక్షణ ప్రయత్నంలో మహమ్మద్ బాగా అలసిపోయాడు. అతను ఒడ్డుకు తిరిగి వచ్చేలోపే, అధిక మొత్తంలో సముద్రపు నీటిని మింగి, స్రృహ కోల్పోయాడని బంధువులు తెలిపారు. రెస్క్యూ బృందాలు అతడిని ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించాడని తండ్రి చెప్పారు. మహమ్మద్ సోదరి పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని, ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటన జరిగిన బీచ్లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







