హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- April 19, 2026
న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి దాటుతున్న సమయంలో భారత జెండా కలిగిన రెండు చమురు నౌకల పై దాడి జరిగినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.
చమురు సరుకు తీసుకెళ్తున్న ఈ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో ఉండగా దాడికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఇరాన్ రాయబారిని పిలిపించి, భారత అభిప్రాయాన్ని తమ ప్రభుత్వానికి తెలియజేయాలని కోరినట్లు తెలిపింది. అలాగే హోర్ముజ్ జలసంధి ద్వారా భారతానికి వస్తున్న నౌకల రాకపోకలను త్వరితగతిన సురక్షితంగా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించింది.
ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఈ ఘటన చోటుచేసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకు దారి తీసింది. నౌకాయాన భద్రత, ఇంధన సరఫరాలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







