హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- April 19, 2026
న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి దాటుతున్న సమయంలో భారత జెండా కలిగిన రెండు చమురు నౌకల పై దాడి జరిగినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.
చమురు సరుకు తీసుకెళ్తున్న ఈ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో ఉండగా దాడికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఇరాన్ రాయబారిని పిలిపించి, భారత అభిప్రాయాన్ని తమ ప్రభుత్వానికి తెలియజేయాలని కోరినట్లు తెలిపింది. అలాగే హోర్ముజ్ జలసంధి ద్వారా భారతానికి వస్తున్న నౌకల రాకపోకలను త్వరితగతిన సురక్షితంగా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించింది.
ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఈ ఘటన చోటుచేసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకు దారి తీసింది. నౌకాయాన భద్రత, ఇంధన సరఫరాలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







