అబుధాబీ క్యాబ్స్ లో కెమెరాలు - పెరిగిన నిజాయితీ, భద్రతలు
- September 12, 2015
యూ. ఏ. ఈ. రాజధాని అబుధాబీలోని క్యాబ్ లలో CCTV కెమెరాలు, సౌండ్ రికార్డింగ్ సిస్టంల ఏర్పాటుపై క్యాబ్ డ్రైవర్లు మరియు ప్రయాణీకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం జూన్ నెలలో మొదలైన ఈ ప్రక్రియ జూన్ 2016 కల్లా పూర్తవుతుందని తెలియవచ్చింది. దీనివల్ల, ప్రమాదకరంగా లేదా వేగంగా డ్రైవ్ చేయడం, తద్వారా వచ్చే ప్రమాదాలను, నడిపేటపుడు మొబైల్ ఫోన్లలో మాట్లాడడం వంటి వాటిని కూడా నివారించడంలో ఉపయుక్తంగా ఉంది. ఈ విధానం ఏర్పాటుచేసిన నాటినుండి ఛార్జీలు చెల్లించకుండా వెళ్ళిపోయే వారు, వేచి ఉండమని ఇంకా రాకుండా ఉండేవరితో వారితో ఇబ్బందులు తప్పాయని, ప్రయాణీకుల వివాదాలు, దురుసుప్రవర్తన తగ్గిందని, తమ పని సులువైందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక భారతీయ డ్రైవర్ సంతోషిస్తుండగా,తమకు కూడా డ్రైవర్ల వల్ల వచ్చే ఫోన్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా నడపడం వంటి ప్రమాదాలు తప్పాయని జైనాబ్ హాష్మీ, స్యామ్ కెంట్ వంటి ప్రయాణీకులు సంతోషిస్తున్నారు. ట్రాన్స్ ఎ. డి. కి చెందిన అహ్మెద్ ముస్తఫా, ఈ సంవత్సరాంతానికి ఇంచుమించు 5000 క్యాబ్ లు CCTV సిస్టం ను కలిగిఉంటాయని, రాబోయే కొత్త కార్లలో ఎలాగూ ఇది ఇమిడి ఉంటుందని తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు







