ముసున్నహ్ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు..
- January 18, 2017
మంగళవారం మధ్యాహ్నం స్థానిక ముసున్నహ్ సమీపంలోని ఒక పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ తో సహా నల్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఈ ప్రమాదం గూర్చి మాట్లాడుతూ,వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ రోడ్డుపై విన్యాసాలు ప్రదర్శిస్తూ ప్రయాణిస్తున్నాడని, అకస్మాత్తుగా 4 డబ్ల్యూడీ వాహనంపై ఆ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపారు.ఈ వాహనంలోని నల్గురు పాఠశాల విద్యార్థులతో ఈ వాహనం పల్టీ కొట్టి ఒక స్థిరమైన వస్తువుని డీ కొని ఆగింది. ఈ ప్రమాదానికి కారణమైన గాయపడిన డ్రైవర్ ను అరెస్టు చేశారు. నల్గురు అబ్బాయిలకు తీవ్ర గాయాల కావడంతో వారిని ముసున్నహ్ లోని ఒక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







