ఖతార్లో ఇండియన్ స్కూల్స్కి ఓవర్ ఫ్లో..
- January 18, 2017ఖతార్లో ఇండియన్ స్కూల్స్లో అడ్మిషన్స్ సందర్భంగా ఓవర్ ఫ్లో సమస్య వెంటాడుతోంది. అందుబాటులో ఉన్న సీట్లకంటే చాలా ఎక్కువగా దరఖాస్తులు వస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు నిరాశ తప్పడంలేదు. కొన్ని స్కూల్స్, మినిస్ట్రీ నుంచి అదనపు సీట్లకు సంబంధించిన అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. 2017-18 అకడమిక్ ఇయర్ కోసం అడ్మిషన్లు ప్రారంభం కాగా, సీట్ల కోసం పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎంఇఎస్ స్కూల్, ఇప్పటికే 8000 మంది స్టూడెంట్స్ని కలిగి ఉంది. అయితే ఆ స్కూల్ కెపాసిటీ కేవలం 5000 మాత్రమే. మిగతా ఇండియన్ స్కూల్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నిబంధనలకు మించి విద్యార్థుల్ని కలిగి ఉంటే మినిస్ట్రీ నుంచి విద్యాసంస్థలు సమస్యలు ఎదుర్కోక తప్పదు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయా స్కూళ్ళు, మినిస్ట్రీ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మినిస్ట్రీ నుంచి ప్రత్యేక అనుమతుల కోసం చాలా స్కూల్స్ ఎదురుచూస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







