కొత్త సర్వీసులు ప్రారంభించనున్న ఎయిర్ ఏషియా.!
- January 18, 2017
విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా దేశ రాజధాని దిల్లీ నుంచి రెండు కొత్త సర్వీసులు ప్రారంభించింది. ఈ సర్వీసులు 2017 ఫిబ్రవరి 19నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఎయిర్ ఏషియా ఇండియా ప్రతినిధి అమర్ అబ్రోల్ తెలిపారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ... దిల్లీ - శ్రీనగర్, దిల్లీ - బాగ్డోగ్రాకి మధ్య ఈ నూతన సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. అలాగే దిల్లీ - పుణె మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.
2016లో సంస్థకు మంచి లాభాలు వచ్చాయని, 2017లోనూ అదే దిశగా తాము ప్రయత్నాలు జరుపుతున్నామని. ఇందులో భాగంగానే ఈ నూతన సర్వీసులను ప్రారంభించినట్లు అమర్ వెల్లడించారు. దిల్లీ, బెంగళూరు నుంచి ప్రయాణికులను తమ సంస్థ 13 గమ్యస్థానాలకు చేర్చుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలపై ఆఫర్లు ప్రకటించింది. దిల్లీ - శ్రీనగర్ మధ్య టికెట్ ధర రూ.1,999 ఉండగా, దిల్లీ - బాగ్డోగ్రాకి రూ.2,499, దిల్లీ- పుణెకి రూ.2,999గా నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







