ఒమన్ లో సెల్ఫీ దిగుతూ నీటిలో మునిగిపోయిన ఇద్దరు సోదరీమణులు
- January 20, 2017
మస్కట్ : ఆ ఫోటో వారికి చివరి ఫోటో అవుతుందని...వారు ఊహించలేదు...నీటి కొలను వద్ద ముచ్చటగా సెల్ఫీ దిగుదామనుకొని..అంచు వద్దకు వెళ్ళి దిగితే మరింత అందంగా వస్తుందనుకొని అందరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ దుర్ఘటన జాలం బాణీ బు ఆలీ లో జరిగిందని ఓ ఇరువురు సోదరీమణులు నీళ్లలో మునిగి గల్లంతయ్యారని రాయల్ ఒమన్ పోలీస్ ట్వీట్ చేశారు ఏసిల ప్రాంతంలో ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు నీటిలో ఒక్కసారిగా మునిగిపోయారని తెలిపారు. అక్టోబర్ 2016 లో ఇరువురు శ్రీలంక అమ్మాయిలు సలలాహ్ కు కుటుంబ పిక్నిక్ వచ్చారు. సెల్ఫీ తీసుకొందామని ఆ శ్రీలంక అమ్మాయిలు, ఐన్ జాజిజ్ నీటి కొలను పక్కన ఫోటోలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు...ఈ సమయంలో ఒక మహిళ అకస్మాత్తుగా పడిపోయింది. ఈ కంగారులో మునిగిపోయిన ఆమె తన సోదరిని నీటిలోకి బలంగా లాగడంతో ఇరువురు మరణించారని రాయల్ ఒమన్ పోలీస్ ట్వీట్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్









