వలసదారులకు రెమిటెన్స్ ఫీజ్ లేదు..
- January 24, 2017
సౌదీ ఫైనాన్స్ మినిస్ట్రీ, వలసదారులకు రెమిటీస్ ఫీజు ఉండదని స్పష్టం చేసింది. కింగ్డమ్కి చెందిన అడ్వయిజరీ షురా కౌన్సిల్ ఇటీవలే 6 శతం లెవీని వలసదారుల రెమిటెన్సెస్పై విధించాలనే నిర్ణయం ప్రకటించిన అనంతరం తాజా ప్రకటన ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చింది. సౌదీ అరేబియాలోని 30 మిలియన్ల మందిలో మూడో వంతు వివిధ దేశాలకు చెందినవారే ఉన్నారు. వారందరికీ స్వదేశంలో కన్నా ఎక్కువగా సౌదీ అరేబియాలోనే పే స్కేల్స్ దొరుకుతున్నాయి. అయితే గత కొంతకాలంగా నెలకొన్న చమురు ధరల సంక్షోభం నేపథ్యంలో వలసదారులపై ఆదాయపు పన్నును విధించేందుకు గత ఏడాది సన్నాహాలు జరిగాయి. అయితే షురా కౌన్సిల్ తెరపైకి తెచ్చే ప్రతిపాదనల్ని అన్ని సందర్భాల్లోనూ అమలు పరచడం జరగదు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకుగాను పలు రకాలైన రుసుముల్ని పెంచడం జరిగిందనీ, అందుకే కొత్తగా వలసదారులపై ఆర్థిక భారం మోపే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచనలు జరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







