ప్రత్యేక హోదాపై గళం విప్పిన సినీ ప్రముఖులు...
- January 24, 2017
సంప్రదాయ ఆట జల్లి కట్టు పై నిషేధంపై సుప్రీ కోర్టు ఇచ్చిన తీర్పునే తిరగరాయించుకొన్న తమిళుల పోరాటం నుంచి స్ఫూర్తిని పొందిన సీమాంద్ర యువత ప్రత్యేక హోదా కోసం గళం విప్పుతోంది. పవన్ ఆరు నెలల క్రితమే ప్రత్యేకహోదా పై గళం విప్పగా.. అప్పుడు శివాజీ, సంపూర్ణేష్ బాబు తప్ప ఏ ఒక్కరి నుంచి మద్దతు రాలేదు.. కానీ ప్రస్తుత పరిస్థితులు మారాయి.. అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చింది..
ఇప్పటికే సందీప్ కిషన్, నిఖిల్ వంటి హీరోలు యువత చెప్పటిన మౌన దీక్షకు మద్దతు తెలిపిన సంగతి విధితమే.. తాజాగా వీరిబాటలో మరికొందరు సినీ ప్రముఖులు యువత చెప్పటిన మౌన దీక్షకు తమ మద్దతు తెలిపారు..
మంచు మనోజ్ ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ స్టేటస్ సైలెంట్ ప్రొటెస్ట్ కి తన మద్దతు తెలుపుతూ తన గుంటూరోడు మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని పోస్టుపోన్ చేసుకున్నాడు.
ప్రముఖ రచయిత కోన వెంకట్ ప్రత్యేక హోదా ఇవ్వండి అని మేం కొత్తగా ఏమీ కోరడం లేదు. మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని మాత్రమే అడుగుతున్నాం. మీరు ప్రత్యేక హోదా అనే హామీని తీసి పక్కనపెడితే...ప్రజలు ప్రభుత్వాన్ని దించి పక్కన పెడతారేమో. కొంచెం చూసుకోండి. అని తనదైన శైలిలో గళం విప్పారు.
లోక్ సత్తా పార్టీ అధినేత జేపీ ఏపీ యువత ఒక్కతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం గళం విప్పాలి అని కోరుకున్నారు..
పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పోరాటంపై నాకు నమ్మకం ఉంది. ప్రజల ఆకాంక్షలు ఫలించే కోణంలో ఆయన ఇచ్చిన పిలుపునకు నా పూర్తి మద్దతుఅని ట్వీట్ చేశారు..
వరుణ్ తేజ్ః రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే ఏ అంశానికైనా నా మద్దతు ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మద్దతివ్వండి.
మన రాష్ట్రానికి హామీ ఇచ్చిన దాన్ని సాధించుకునేందుకు మనమంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇది ఏపీకి ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా గళం విప్పుదాం అని సాయి ధరం తేజ్ స్పందించారు.
తెలుగు యువతకు ఏదైనా సాధించే శక్తి ఉంది. టాలీవుడ్ సెలబ్రిటీలు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ నెరవేర్చుకునేందుకు ముందుకు రావాలి. మనమంతా ఐక్యం అవుదాం. ఏపీ హక్కును సాధించుకుందాం అని ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







