భాగ్యనగరంకు రోడ్డుపై నడిచే ట్రామ్ రైలు రాబోతోంది
- January 24, 2017
రోడ్డుపై నడిచే ట్రామ్ రైలును సైతం హైదరాబాదులో ప్రవేశపెట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. మొదటి దశలో మొజంజాహీ మార్కెట్ నుంచి చార్మినార్ వరకు పనులు ప్రారంభమవుతాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు కోల్కతా, ముంబై వంటి నగరాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ట్రామ్ రైలు హైదరాబాదుకు వస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్ధన్రెడ్డి సోమవారం బంజారాహిల్స్ ఆస్కీలో జరిగిన ఇండో ప్రెంచ్ సదస్సులో పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఇంజనీరింగ్ నిపుణులు ప్రతిపాదిత మార్గాల్లో పర్యటించి ప్రాజెక్టు వివరాలు పూర్తిస్థాయిలో సిద్దం చేస్తారని స్పష్టం చేశారు. మొదటి దశలో ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం చార్మినార్ నుంచి హుస్సేన్సాగర్ వరకు, అలాగే అబిడ్స్ నుంచి సచివాలయం, రవీంద్రభారతి, సెక్రటేరియట్, హిమాయత్ నగర్, నారాయణగూడ మీదుగా మార్గం నిర్మించి తిలక్ రోడ్డు ద్వారా తిరిగి అబిడ్స్లో కలపాలని ప్రాథమిక ప్రణాళిక రూపొందించారు. చార్మినార్ నుంచి గొల్కొండ వరకు కూడా మార్గం నిర్మించే యోచనలో ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







