రాత్రి ఫోన్ లో ప్రధాని మోడీతో మాట్లాడనున్న ట్రంప్!
- January 24, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేయనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. మంగళవారానికి ట్రంప్ షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా వైట్ హౌస్ వర్గాలు ఈ మేరకు పేర్కొన్నాయి.
భారతీయ కాల మాన ప్రకారం.. మంగళవారం రాత్రి 11:30 గంటలకు (వాషింగ్టన్ లో మధ్యాహ్నం ఒంటి గంట) ట్రంప్... ప్రధాని మోడీతో మాట్లాడతారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇప్పటికే నలుగురు దేశాధినేతలతో ట్రంప్ మాట్లాడారు.
జనవరి 21న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడీ, మెక్సికో అధ్యక్షుడు పేనా నీటో లతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు, ఈజిప్ట్ అధ్యక్షడు అబ్దెల్ ఫతా ఎల్ సీసీలకూ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు.
ఇక ట్రంప్ మాట్లాడనున్న ఐదో దేశాధినేత మన నరేంద్ర మోడీ. నవంబర్ 8న అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన అతి కొద్దిమంది దేశాధినేతలలో మోడీ ఒకరు.
ఎన్నికల ప్రచార సమయంలో కూడా ట్రంప్ ఇండియా తో సంబంధాలను మెరుగుపరచు కోవడంపై ఆసక్తి చూపారు. ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ఆర్ధిక సంస్కరణలను ఆయన ప్రశంసించారు కూడా. ఇప్పుడు ఆయనే స్వయంగా మోడీకి ఫోన్ చేస్తుండడం చూస్తుంటే భారత్ తో బంధం బలోపేతానికి తొలి అడుగు వేసినట్లే కనిపిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







