రాత్రి ఫోన్ లో ప్రధాని మోడీతో మాట్లాడనున్న ట్రంప్!
- January 24, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేయనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. మంగళవారానికి ట్రంప్ షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా వైట్ హౌస్ వర్గాలు ఈ మేరకు పేర్కొన్నాయి.
భారతీయ కాల మాన ప్రకారం.. మంగళవారం రాత్రి 11:30 గంటలకు (వాషింగ్టన్ లో మధ్యాహ్నం ఒంటి గంట) ట్రంప్... ప్రధాని మోడీతో మాట్లాడతారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇప్పటికే నలుగురు దేశాధినేతలతో ట్రంప్ మాట్లాడారు.
జనవరి 21న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడీ, మెక్సికో అధ్యక్షుడు పేనా నీటో లతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు, ఈజిప్ట్ అధ్యక్షడు అబ్దెల్ ఫతా ఎల్ సీసీలకూ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు.
ఇక ట్రంప్ మాట్లాడనున్న ఐదో దేశాధినేత మన నరేంద్ర మోడీ. నవంబర్ 8న అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన అతి కొద్దిమంది దేశాధినేతలలో మోడీ ఒకరు.
ఎన్నికల ప్రచార సమయంలో కూడా ట్రంప్ ఇండియా తో సంబంధాలను మెరుగుపరచు కోవడంపై ఆసక్తి చూపారు. ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ఆర్ధిక సంస్కరణలను ఆయన ప్రశంసించారు కూడా. ఇప్పుడు ఆయనే స్వయంగా మోడీకి ఫోన్ చేస్తుండడం చూస్తుంటే భారత్ తో బంధం బలోపేతానికి తొలి అడుగు వేసినట్లే కనిపిస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









