పనస గింజల మామిడి కూర...
- January 24, 2017
కావలసిన పదార్థాలు: పనసగింజలు- 15, మునక్కాడ ముక్కలు- 10, పచ్చి మామిడి తురుము- 1/2 కప్పు, పచ్చిమిర్చి- 4, పసుపు- 1/4 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు, జీలకర్ర- 1/2 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు- 4, తాలింపు దినుసులు- 1 టీ స్పూను, నూనె- 2 టీ స్పూన్లు.
తయారీ విధానం: ముందుగా కొబ్బరి ముక్కలు, రెండు పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రలను మిక్సీ పట్టి పక్కన ఉంచాలి. తరువాత పసనగింజలపై ఉండే తెల్లని పొట్టు తీసేసి, గింజలను కుక్కర్లో వేసి అర కప్పు నీళ్ళు పోసి రెండు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించి తీయాలి. తరువాత ఆ గింజలతో పాటు, మామిడి తురుము, రెండు పచ్చిమిరపకాయలు, మునక్కాడ ముక్కలు, పసుపు వేసి, కప్పుడు నీళ్ళు పోసి, సన్నని మంటపై ఉడికించాలి. మునక్కాడ ముక్కలు ఉడికాక కొబ్బరి పేస్ట్, ఉప్పు వేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించాలి. కూర పూర్తిగా ఉడికాక పోపు పెట్టుకోవాలి.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







