గల్ఫ్ దేశాల్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు...

- January 26, 2017 , by Maagulf
గల్ఫ్ దేశాల్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు...

మస్కట్ : 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గల్ఫ్ దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. భారత రాయబార కార్యాలయం గురువారం దౌత్యకార్యాలయం ఆడిటోరియం వద్ద 68 వ రిపబ్లిక్ దినోత్సవంను ఘనంగా జరుపుకొన్నారు. ఒమన్ లో భారతీయ దౌత్యవేత్ ఇంద్రునికి మణి పాండే   త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆబుధాబి యువరాజు శేఖ్ మోహమ్మద్ న్యూఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో స్వయంగా పాల్గొనడంతో పరేడ్ కార్యక్రమాన్ని అల్ ఇమరాతీ అనే అరబ్బీ న్యూస్ ఛానెల్ ప్రత్యక్ష్య ప్రసారం చేసింది.  జెద్ధాలో జరిగిన కార్యక్రమంలో కాన్సల్ జనరల్ నూర్ రహేమాన్ శేఖ్ పతాకవిష్కరణ చేసి ప్రవాసీ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం కేంద్రం చేపడుతున్న చర్యలను వివరించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని చదివి వినిపించారు. రియాధ్‌లో భారతీయ రాయబారి జావేద్ అహ్మద్ పతాకవిష్కరణ చేసి.. దేశంలో 30 లక్షలకు పైగా ఉన్న భారతీయులకు మంచి పేరుందని చెప్పారు. దుబాయిలో కాన్సల్ జనరల్ అనురాగ్ భూషణ్ పతాకవిష్కరణ చేసి ప్రసంగించారు. ఈ సారి భారతదేశంలో ముఖ్య అతిథిగా ఆబుధాబి యువరాజు శేఖ్ మోహమ్మద్ పాల్గొనడంతో గల్ఫ్ దేశాలకు గణతంత్ర వేడుకల పట్ల ప్రత్యేకత ఏర్పడిందన్నారు. అనంతరం దుబాయిలోని ఇండియన్ హై స్కూల్‌లో కూడా ఆయన పతాకవిష్కరణ చేశారు. ఖతర్‌లో భారతీయ కోస్ట్ గార్డుకు చెందిన నౌక స్నేహాపూర్వక పర్యటనకు వచ్చి ఉండడంతో రిప్లబిక్ డే సందర్భంగా భారతీయులు దాన్ని చూడడానికి వెళ్తున్నారు.కువైత్‌లోని భారతీయ ఎంబసీలో జరిగిన కార్యక్రమం.. సందర్భంగా గల్ఫ్ రాయలసీమ సమితి ప్రతినిధులు ప్రవాసీయులకు అల్పాహారాన్ని సమకూర్చారు. ఆబుధాబి, మనమాలలో కూడ కార్యక్రమాలు ఘనంగా జరిగేయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com