నేటితో యూ.ఏ.ఈ. లో మధ్యాహ్న విరామ నిబంధన సరి
- September 15, 2015
యూ. ఏ. ఈ. లో కార్మిక మంత్రి శ్రీ సక్ర్ ఘోబష్ ఆదేశాల మేరకు కాల్చివేసే ఎండల్లో పనిచేసే కార్మికుల సంక్షేమానికై జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12 30 నుండి 3 00 గంటల మధ్య పనిచేయడాన్ని నిషేధిస్తూ, అధిక పనిగంటలలో పనిచేయించడం శిక్షా ర్హo అని విధించిన ‘మధ్యాహ్న విరామ నిబంధన’ నిబంధన నేటితో సరి అని కార్మిక శాఖ తెలిపింది. గత 11 సంవత్సరాల నుండి1980 వ సంవత్సరపు ఫెడరల్ లా నెంబరు 8 ప్రకారం ఈ నిబంధన ఆమలౌ తూ వస్తోంది.ఐతే, ఆఖరి నిముషం వరకు పర్యవేక్షణ బృందాలు, అన్ని కంపెనీలు ఈ నిబంధన పాటిస్తున్నాయా లేదా అని నిరంతరం పహారా కాస్తునే ఉన్నాయి. పై నిబంధన పాటించినందుకు, కార్మికులకు ఉచిత ఆరోగ్య తనిఖీలు, ఆత్మ రక్షణ విధానలలో శిక్షణ ఇవ్వడం వంటి సంరక్షణ చర్యలు చేపట్టినందుకు అన్ని ప్రభుత్వ మరీయు ప్రైవేటు కంపెనీల వారికి, మరియు కార్మికులకు చల్లని నీరు మరియు పళ్ళ రసాలు ఇచ్చి దయతో సహకరించిన ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







