నేటితో యూ.ఏ.ఈ. లో మధ్యాహ్న విరామ నిబంధన సరి
- September 15, 2015
యూ. ఏ. ఈ. లో కార్మిక మంత్రి శ్రీ సక్ర్ ఘోబష్ ఆదేశాల మేరకు కాల్చివేసే ఎండల్లో పనిచేసే కార్మికుల సంక్షేమానికై జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12 30 నుండి 3 00 గంటల మధ్య పనిచేయడాన్ని నిషేధిస్తూ, అధిక పనిగంటలలో పనిచేయించడం శిక్షా ర్హo అని విధించిన ‘మధ్యాహ్న విరామ నిబంధన’ నిబంధన నేటితో సరి అని కార్మిక శాఖ తెలిపింది. గత 11 సంవత్సరాల నుండి1980 వ సంవత్సరపు ఫెడరల్ లా నెంబరు 8 ప్రకారం ఈ నిబంధన ఆమలౌ తూ వస్తోంది.ఐతే, ఆఖరి నిముషం వరకు పర్యవేక్షణ బృందాలు, అన్ని కంపెనీలు ఈ నిబంధన పాటిస్తున్నాయా లేదా అని నిరంతరం పహారా కాస్తునే ఉన్నాయి. పై నిబంధన పాటించినందుకు, కార్మికులకు ఉచిత ఆరోగ్య తనిఖీలు, ఆత్మ రక్షణ విధానలలో శిక్షణ ఇవ్వడం వంటి సంరక్షణ చర్యలు చేపట్టినందుకు అన్ని ప్రభుత్వ మరీయు ప్రైవేటు కంపెనీల వారికి, మరియు కార్మికులకు చల్లని నీరు మరియు పళ్ళ రసాలు ఇచ్చి దయతో సహకరించిన ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







