మీ మట్టి చేతులు ... శుభ్రమైన యూ.ఏ.ఈ.కి దారులు
- September 15, 2015
మొత్తం ఏడు ఎమిరేట్ దేశాలలో జరగనున్న 14 వ "క్లీన్ అప్ యూ.ఏ.ఈ." కాంపైన్, డిసెంబర్ 6 వ తేదీ నుండి 16 వ తేదీ వరకు జరుగుతుందని, నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ (EEG) ఛైర్ పర్సన్ హబీబా అల్ మరాషీ - ఈ కాంపైన్ దుబాయిలో మొదలై, దిబ్బా-అల్-హిస్న్ లో ముగుస్తుందని ; 2002 లో ప్రారంభమైన ఈ కార్యక్రమం యూ. ఏ. ఈ పర్యంతం వ్యాప్తించి, దేశాన్ని పర్యావరణ హితంగా చేసే లక్ష్యంతో ప్రజలనందరినీ ఏకంచేసే కార్యక్రమంగా మారిందని వివరించారు. ఈ సంవత్సరం లక్ష్యం - ప్రపంచాన్ని మరింత మెరుగైన నివాస ప్రదేశం గా మార్చడానికి కలసి పనిచేయడం అని, ముఖ్యంగా ప్రతి వ్యక్తికి ఆచరణలోకి దిగవలసిన బాధ్యత ఉందని ఆమె తెలిపారు. గత సంవత్సరం ఈ కార్యక్రమంలో 123, 176 మంది అవిశ్రాంతంగా పాల్గొని, 94 టన్నుల పొగుపడిన చెత్తను శుభ్రం చేశారని, ఈ సంవత్సరం మరింత మంది పాల్గొంటారని ఆశిస్తున్నామన్నారు. సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి యూ. ఏ. ఈ. నివాసులకు ఉపయోగపడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెబుతూ కార్యక్రమ కాలెండరును ఈ విధంగా ప్రకటించారు:
డిసెంబరు 5 - దుబాయి
డిసెంబరు 6- రాస్-అల్-ఖైమా
డిసెంబరు 7 - షార్జా
డిసెంబరు 8 - ఆజ్మాన్
డిసెంబరు 9 - అబూ ధబి
డిసెంబరు 10 - అల్ ఐన్
డిసెంబరు 12 - ఉమ్మ్-అల్- క్వ్వైన్
డిసెంబరు 13 - ఫ్యూజైరా
డిసెంబరు 15 - ఫ్యూజైరా లో మొక్కలు నాటే కార్యక్రమం
డిసెంబరు 16- దిబ్బా-అల్-హిస్న్
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







