మీ మట్టి చేతులు ... శుభ్రమైన యూ.ఏ.ఈ.కి దారులు
- September 15, 2015
మొత్తం ఏడు ఎమిరేట్ దేశాలలో జరగనున్న 14 వ "క్లీన్ అప్ యూ.ఏ.ఈ." కాంపైన్, డిసెంబర్ 6 వ తేదీ నుండి 16 వ తేదీ వరకు జరుగుతుందని, నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ (EEG) ఛైర్ పర్సన్ హబీబా అల్ మరాషీ - ఈ కాంపైన్ దుబాయిలో మొదలై, దిబ్బా-అల్-హిస్న్ లో ముగుస్తుందని ; 2002 లో ప్రారంభమైన ఈ కార్యక్రమం యూ. ఏ. ఈ పర్యంతం వ్యాప్తించి, దేశాన్ని పర్యావరణ హితంగా చేసే లక్ష్యంతో ప్రజలనందరినీ ఏకంచేసే కార్యక్రమంగా మారిందని వివరించారు. ఈ సంవత్సరం లక్ష్యం - ప్రపంచాన్ని మరింత మెరుగైన నివాస ప్రదేశం గా మార్చడానికి కలసి పనిచేయడం అని, ముఖ్యంగా ప్రతి వ్యక్తికి ఆచరణలోకి దిగవలసిన బాధ్యత ఉందని ఆమె తెలిపారు. గత సంవత్సరం ఈ కార్యక్రమంలో 123, 176 మంది అవిశ్రాంతంగా పాల్గొని, 94 టన్నుల పొగుపడిన చెత్తను శుభ్రం చేశారని, ఈ సంవత్సరం మరింత మంది పాల్గొంటారని ఆశిస్తున్నామన్నారు. సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి యూ. ఏ. ఈ. నివాసులకు ఉపయోగపడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెబుతూ కార్యక్రమ కాలెండరును ఈ విధంగా ప్రకటించారు:
డిసెంబరు 5 - దుబాయి
డిసెంబరు 6- రాస్-అల్-ఖైమా
డిసెంబరు 7 - షార్జా
డిసెంబరు 8 - ఆజ్మాన్
డిసెంబరు 9 - అబూ ధబి
డిసెంబరు 10 - అల్ ఐన్
డిసెంబరు 12 - ఉమ్మ్-అల్- క్వ్వైన్
డిసెంబరు 13 - ఫ్యూజైరా
డిసెంబరు 15 - ఫ్యూజైరా లో మొక్కలు నాటే కార్యక్రమం
డిసెంబరు 16- దిబ్బా-అల్-హిస్న్
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







