గంటకు 750 కి.మీ. వేగంతో ప్రయాణం...

- January 31, 2017 , by Maagulf
గంటకు 750 కి.మీ. వేగంతో ప్రయాణం...

హైపర్‌లూప్‌ సంస్థ ఛైర్మన్‌ బిబోప్‌ జి.గ్రెస్తా 
అమరావతి: తమ సంస్థ ఆధ్వర్యంలో బుల్లెట్‌ రైలును మించిన వేగంతో ప్రయాణించే రవాణా వ్యవస్థను తీసుకొస్తామని హైపర్‌లూప్‌ సంస్థ ఛైర్మన్‌ బిబోప్‌ జి.గ్రెస్తా వెల్లడించారు. గంటకు 750 కి.మీ. వేగంతో ప్రయాణించేలా తమ పరిజ్ఞానం ఉంటుందని చెప్పారు. విద్యుత్‌ అయస్కాంత శక్తితో ఒక ట్యూబ్‌ లోపల పాడ్స్‌, క్యాప్సూల్స్‌ లాంటివి అమరుస్తామని, పిల్లర్లు నిర్మించి దానిపై ప్రీఫ్యాబ్‌ స్టీల్‌ ట్యూబ్‌లు వేస్తామని, ఒక్కో క్యాప్సూల్‌లో 40 మంది వరకూ ప్రయాణించేలా అవకాశం ఉంటుందని వివరించారు.

వేగం ఎక్కువైనా ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భయం ఉండబోదన్నారు. ఒక కి.మీ.కు 40 మిలియన్‌ డాలర్ల వ్యయమవుతుందని అంచనా వేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మంగళవారం సాయంత్రం ఆయన బృందం భేటీ అయింది. తొలుత ఈ రవాణా వ్యవస్థ తీరుతెన్నులపై ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com