గంటకు 750 కి.మీ. వేగంతో ప్రయాణం...
- January 31, 2017
హైపర్లూప్ సంస్థ ఛైర్మన్ బిబోప్ జి.గ్రెస్తా
అమరావతి: తమ సంస్థ ఆధ్వర్యంలో బుల్లెట్ రైలును మించిన వేగంతో ప్రయాణించే రవాణా వ్యవస్థను తీసుకొస్తామని హైపర్లూప్ సంస్థ ఛైర్మన్ బిబోప్ జి.గ్రెస్తా వెల్లడించారు. గంటకు 750 కి.మీ. వేగంతో ప్రయాణించేలా తమ పరిజ్ఞానం ఉంటుందని చెప్పారు. విద్యుత్ అయస్కాంత శక్తితో ఒక ట్యూబ్ లోపల పాడ్స్, క్యాప్సూల్స్ లాంటివి అమరుస్తామని, పిల్లర్లు నిర్మించి దానిపై ప్రీఫ్యాబ్ స్టీల్ ట్యూబ్లు వేస్తామని, ఒక్కో క్యాప్సూల్లో 40 మంది వరకూ ప్రయాణించేలా అవకాశం ఉంటుందని వివరించారు.
వేగం ఎక్కువైనా ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భయం ఉండబోదన్నారు. ఒక కి.మీ.కు 40 మిలియన్ డాలర్ల వ్యయమవుతుందని అంచనా వేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మంగళవారం సాయంత్రం ఆయన బృందం భేటీ అయింది. తొలుత ఈ రవాణా వ్యవస్థ తీరుతెన్నులపై ఆయన విలేకర్లతో మాట్లాడారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









