గంటకు 750 కి.మీ. వేగంతో ప్రయాణం...
- January 31, 2017
హైపర్లూప్ సంస్థ ఛైర్మన్ బిబోప్ జి.గ్రెస్తా
అమరావతి: తమ సంస్థ ఆధ్వర్యంలో బుల్లెట్ రైలును మించిన వేగంతో ప్రయాణించే రవాణా వ్యవస్థను తీసుకొస్తామని హైపర్లూప్ సంస్థ ఛైర్మన్ బిబోప్ జి.గ్రెస్తా వెల్లడించారు. గంటకు 750 కి.మీ. వేగంతో ప్రయాణించేలా తమ పరిజ్ఞానం ఉంటుందని చెప్పారు. విద్యుత్ అయస్కాంత శక్తితో ఒక ట్యూబ్ లోపల పాడ్స్, క్యాప్సూల్స్ లాంటివి అమరుస్తామని, పిల్లర్లు నిర్మించి దానిపై ప్రీఫ్యాబ్ స్టీల్ ట్యూబ్లు వేస్తామని, ఒక్కో క్యాప్సూల్లో 40 మంది వరకూ ప్రయాణించేలా అవకాశం ఉంటుందని వివరించారు.
వేగం ఎక్కువైనా ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భయం ఉండబోదన్నారు. ఒక కి.మీ.కు 40 మిలియన్ డాలర్ల వ్యయమవుతుందని అంచనా వేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మంగళవారం సాయంత్రం ఆయన బృందం భేటీ అయింది. తొలుత ఈ రవాణా వ్యవస్థ తీరుతెన్నులపై ఆయన విలేకర్లతో మాట్లాడారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







