హనీమూన్ కోసం దుబాయ్ వచ్చిన సౌదీ జంట సంబ్రమాశ్చర్యం...
- February 01, 2017
దుబాయ్: అతిధి ప్రముఖులు ఎవరైనా దేశంలోనికి అడుగు పెడితే...ఘన స్వాగతాలు మామూలే , కానీ దేశంలోనికి అడుగుపెట్టిన పర్యాటకులను ఎదురెళ్లి వారికి సెలవు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇమిగ్రేషన్ అధికారులు ఆహ్వానం పలకడం అరుదుగా జరుగుతుంది. కొత్తగా వివాహం చేసుకొన్న సౌదీ దంపతులు హనీమూన్ పర్యటన కోసం దుబాయ్ వస్తే, ఆ మర్యాదే వేరని నవ దంపతులు మురిసిపోతున్నారు. విమానం నుంచి కాలు కింద పెట్టడమే తరువాయి రెసిడెన్సీ మరియు విదేశీయ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ దుబాయ్ అధికారులే స్వయంగా బహుమతులు మరియు పువ్వులను ఇస్తూ స్వాగతిస్తున్నారు. ఈ అనూహ్య మర్యాదకు కొత్త దంపతులు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. వారి హనీమూన్ దుబాయ్ వస్తున్నట్లు తమ స్నేహితులకు పెట్టిన ఆ ట్వీట్ గమనించి ఆ జంట ఏ సమయానికి ..ఏ విమానంలో వస్తున్నారో తెల్సుకొని దుబాయ్ అధికారులు స్వయంగా స్వాగతం పలకడం ఎంతో మధురానుభూతిని మిగులుస్తుందని పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







