స్వల్పంగా పెరిగిన బంగారం ధర...
- February 01, 2017
ముంబయి: ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.29,750కి చేరింది. బంగారం ధర గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉంది. జనవరి 28 నుంచి పది గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగి కేజీ వెండి ధర రూ.42వేల మార్కును దాటిపోయింది. ఈరోజు కేజీ వెండి రూ. 300 పెరిగి రూ.42,200కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్ మార్కెట్లో ఈరోజు ఔన్సు బంగారం ధర 0.59శాతం పెరిగి 1,208.50 డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







