సరికొత్త మెనూతో 'పంజాబీ బై నేచుర్'
- February 01, 2017
పంజాబీ రెస్టారెంట్ 'పంజాబీ బై నేచుర్' ఔద్ మెతాలో ఫుడ్ లవర్స్ అభిమానాన్ని చూరగొంటోంది చాలాకాలంగా. ఈ సీజన్లో కొత్త మెనూతో ఫుడ్ లవర్స్ని మరింతగా ఆకట్టుకుంటోంది. స్పైసీ టిక్కాస్, సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేసిన మసాలాలతో అత్యద్భుతమైన ఆహార పదార్థాల్ని వేడివేడిగా వడ్డించడం ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ. పంజాబీ బై నేచుర్ వ్యవస్థాపకుడు షరన్ కక్వానీ మాట్లాడుతూ, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాల్లో తమకు ఎంతో మంచి పేరుందనీ, కొత్త మెనూతో ఫుడ్ లవర్స్ని మరింతగా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పన్నీర్ ప్లాటర్ నుంచి షీక్ కబాబ్ వరకూ పలు కొత్త మెనూస్తో ఫుడ్ లవర్స్ని ఆకర్షిస్తోంది పంజీబీ బై నేచుర్. చార్ గ్రిల్డ్ లాంబ్ గలాఫీ షీక్ కబాబ్, డెలీషియస్ తండూరీ అలూ, నింబు దా ముర్గ్ వంటివి కొత్త మెనూలో చేర్చారు. జనవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ మెనూ పట్ల ఫుడ్ లవర్స్ ఎంతో ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నారు. కో ఫౌండర్ పంజాబీ బై నేచుర్, నిర్వి గోసాలియా మాట్లాడుతూ, పంజాబీ సంప్రదాయ వంటకాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయనీ, టండూరీ అలీ డిష్తోపాటు, చికెన్లో కొత్త వెరైటీలు చవులూరిస్తాయని అన్నారు.

తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







