సరికొత్త మెనూతో 'పంజాబీ బై నేచుర్‌'

- February 01, 2017 , by Maagulf


పంజాబీ రెస్టారెంట్‌ 'పంజాబీ బై నేచుర్‌' ఔద్‌ మెతాలో ఫుడ్‌ లవర్స్‌ అభిమానాన్ని చూరగొంటోంది చాలాకాలంగా. ఈ సీజన్‌లో కొత్త మెనూతో ఫుడ్‌ లవర్స్‌ని మరింతగా ఆకట్టుకుంటోంది. స్పైసీ టిక్కాస్‌, సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేసిన మసాలాలతో అత్యద్భుతమైన ఆహార పదార్థాల్ని వేడివేడిగా వడ్డించడం ఈ రెస్టారెంట్‌ స్పెషాలిటీ. పంజాబీ బై నేచుర్‌ వ్యవస్థాపకుడు షరన్‌ కక్వానీ మాట్లాడుతూ, వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌ వంటకాల్లో తమకు ఎంతో మంచి పేరుందనీ, కొత్త మెనూతో ఫుడ్‌ లవర్స్‌ని మరింతగా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పన్నీర్‌ ప్లాటర్‌ నుంచి షీక్‌ కబాబ్‌ వరకూ పలు కొత్త మెనూస్‌తో ఫుడ్‌ లవర్స్‌ని ఆకర్షిస్తోంది పంజీబీ బై నేచుర్‌. చార్‌ గ్రిల్డ్‌ లాంబ్‌ గలాఫీ షీక్‌ కబాబ్‌, డెలీషియస్‌ తండూరీ అలూ, నింబు దా ముర్గ్‌ వంటివి కొత్త మెనూలో చేర్చారు. జనవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ మెనూ పట్ల ఫుడ్‌ లవర్స్‌ ఎంతో ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నారు. కో ఫౌండర్‌ పంజాబీ బై నేచుర్‌, నిర్వి గోసాలియా మాట్లాడుతూ, పంజాబీ సంప్రదాయ వంటకాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయనీ, టండూరీ అలీ డిష్‌తోపాటు, చికెన్‌లో కొత్త వెరైటీలు చవులూరిస్తాయని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com