మిలియనీర్గా మారిన స్టోర్ కీపర్
- February 01, 2017
ఇండియన్ స్టోర్ కీపర్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్స్ కేటగిరీలో చోటు సంపాదించుకున్నాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తీసిన డ్రాలో ఆయనకు 1 మిలియన్ డాలర్ల బహుమతి లభించింది. ఆయన పేరు అజెష్ పద్మనాభం. షార్జాలో నివసిస్తారీయన. మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కార్యక్రమంలో అజెష్ రెగ్యులర్ పార్టిసిపెంట్. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. అజెష్, ఫెడరల్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీలో స్టోర్ కీపర్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీకి కృతజ్ఞతలు తెలిపారాయన. కాగా, డానీ జెహ్రా కూడా మరో బహుమతిని గెలుచుకున్నారు. డానీ జెహ్రా లెబనీస్ దేశానికి చెందినవారు. తన కుమార్తె పేరు మీద తీసిన టిక్కెట్కి ఆస్టన్ మార్టిన్ వింటేజ్ స్పోర్ట్ షిఫ్ట్ గెలుపొందారు. జహా కన్స్ట్రక్షన్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. నేపాల్కి చెందిన ప్రజ్వల్ రాజ్ పౌడెల్, డుకాటీ మాన్స్టర్ బైక్ని గెలుపొందారు. 2016 డిసెంబర్ 20న తొలి బైక్ని ఆయన గెలుపొందడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







