ఎల్లుండే ఎన్నికలు పంజాబ్, గోవాలో...

- February 02, 2017 , by Maagulf
ఎల్లుండే ఎన్నికలు పంజాబ్, గోవాలో...

పంజాబ్, గోవాలో ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలే సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో శనివారం పోలింగ్ జరగనుంది. పంజాబ్‌లోని 117 స్థానిలకు, గోవాలోని 40 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్‌లో 22,600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోటి 92 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గోవాలోని 1642 పోలింగ్ కేంద్రాల్లో 10 లక్షల 85వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com