ఎన్నికల జాతర తెలంగాణలో మరోసారి...
- February 02, 2017
హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి ఎన్నికల జాతర మొదలుకానుంది. మే నెలాఖరు వరకు 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. నేడో, రేపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆశావహుల సందడి మొదలైంది. మూడు ఎమ్మెల్యే కోటాలోనూ, స్థానిక సంస్థల కోటాలో ఒకటి, టీచర్స్ కోటాలో మరో స్థానంతోపాటు గవర్నర్ కోటాలోని 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. మార్చి 29న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్. హైదర్ రజ్వీ, మాగం రంగారెడ్డిల పదవి కాలం ముగుస్తుంది. మే 27న నామినేటెడ్ ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫరూఖ్ హుస్సేన్ స్థానాలు ఖాళీ కానున్నాయి. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.
పెద్దల సభలో ప్రస్తుతం గులాబీ పార్టీదే పై చేయిగా ఉంది. రెండున్నరేళ్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కారెక్కించుకుంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 7 స్థానల్లో ఐదుగురు ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరినవారే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







