ఎన్నికల జాతర తెలంగాణలో మరోసారి...

- February 02, 2017 , by Maagulf
ఎన్నికల జాతర తెలంగాణలో మరోసారి...

హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి ఎన్నికల జాతర మొదలుకానుంది. మే నెలాఖరు వరకు 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. నేడో, రేపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆశావహుల సందడి మొదలైంది. మూడు ఎమ్మెల్యే కోటాలోనూ, స్థానిక సంస్థల కోటాలో ఒకటి, టీచర్స్ కోటాలో మరో స్థానంతోపాటు గవర్నర్ కోటాలోని 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. మార్చి 29న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్. హైదర్ రజ్వీ, మాగం రంగారెడ్డిల పదవి కాలం ముగుస్తుంది. మే 27న నామినేటెడ్ ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫరూఖ్ హుస్సేన్ స్థానాలు ఖాళీ కానున్నాయి. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.
పెద్దల సభలో ప్రస్తుతం గులాబీ పార్టీదే పై చేయిగా ఉంది. రెండున్నరేళ్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కారెక్కించుకుంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 7 స్థానల్లో ఐదుగురు ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరినవారే.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com