ఎన్నికల జాతర తెలంగాణలో మరోసారి...
- February 02, 2017
హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి ఎన్నికల జాతర మొదలుకానుంది. మే నెలాఖరు వరకు 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. నేడో, రేపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆశావహుల సందడి మొదలైంది. మూడు ఎమ్మెల్యే కోటాలోనూ, స్థానిక సంస్థల కోటాలో ఒకటి, టీచర్స్ కోటాలో మరో స్థానంతోపాటు గవర్నర్ కోటాలోని 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. మార్చి 29న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్. హైదర్ రజ్వీ, మాగం రంగారెడ్డిల పదవి కాలం ముగుస్తుంది. మే 27న నామినేటెడ్ ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫరూఖ్ హుస్సేన్ స్థానాలు ఖాళీ కానున్నాయి. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.
పెద్దల సభలో ప్రస్తుతం గులాబీ పార్టీదే పై చేయిగా ఉంది. రెండున్నరేళ్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కారెక్కించుకుంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 7 స్థానల్లో ఐదుగురు ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరినవారే.
తాజా వార్తలు
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు
- ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ పథకం 2026 ప్రారంభం
- అగ్రనేతల మధ్య ముదిరిన విభేదాలు
- కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్..
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!









