జనవరి 26 ఘటనలపై విచారణ ప్రారంభం

- February 02, 2017 , by Maagulf
జనవరి 26 ఘటనలపై విచారణ ప్రారంభం

మనామా: టెర్రర్‌ క్రైమ్‌ ప్రాసిక్యూషన్‌ చీప్‌ ప్రాసిక్యూటర్‌ ఇసా అల్‌ రువైయి మాట్లాడుతూ, జనవరి 26న జరిగిన ఘటనలపై విచారణ ప్రారంభమయ్యిందన్నారు. ఈ ఘటనలో టెర్రిస్టు గ్రూపుకు చెందిన కొందరు దుండగులు, సెక్యూరిటీ సిబ్బందిని అలాగే వాహనాల్ని టార్గెట్‌ చేస్తూ దాడికి దిగారు. బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ ఘటనలో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్‌ చేసింది. నిందితులు నేరానికి పాల్పడిన వైనం గురించి, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ వివరాలు అందించింది. అరెస్టయిన నిందితులు తాము ఓ తీవ్రవాద సంస్థలో చేరి, శిక్షణ పొందామని, దాడులకు దిగామని విచారణలో ఒప్పుకున్నట్లు నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. తనిఖీల్లో భాగంగా ఎన్‌ఎస్‌ఎ, నిందితుల నుంచి పెద్దయెత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకుంది. నిందితులంతా కలిసి కొత్తగా ఓ తీవ్రవాద గ్రూపుని ఏర్పాటు చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com