అల్ ముష్రిఫ్లో సామూహిక వివాహాలు
- February 02, 2017
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమక్షంలో సామూహిక వివాహాలు జరిగాయి. అల్ మష్రిఫ్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో వధూవరులు పాల్గొన్నారు. 31 జంటలు ఈ సందర్భంగా వివాహం చేసుకున్నాయి. ముష్రిఫ్ మజ్లిస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అబుదాబీలోని ముష్రిఫ్ ప్రాంతం ఈ వేడుకకి వేదికయ్యింది. షేక్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, షేక్ సురూర్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్, షేక్ సయీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమా పలువురు ప్రముఖులు ఈ వేడుకకి హాజరయి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. స్థానికులు కూడా పెద్దయెత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అధికారులు సైతం పెద్ద సంఖ్యలో హాజరై ఈ అద్భుతమైన వేడుకని తిలకించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







