బీజేపీలోకి ఎస్ఎం కృష్ణ!...
- February 04, 2017
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ త్వరలో బీజీపీలో చేరనున్నట్టు కర్నాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ''ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎప్పడు చేరతారన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది. అయితే ఆయన మా పార్టీలో చేరడం మాత్రం 100 శాతం ఖాయం'' అని పేర్కొన్నారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన 84 ఏళ్ల ఎస్ఎం కృష్ణ... గతవారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ పదవికి, పార్టీ సభ్యుత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్కు అత్యంత విధేయుడిగా పనిచేస్తున్నప్పటికీ.
తన వయసురీత్యా పార్టీ కార్యకలాపాల నుంచి పక్కనబెడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీలో తనకు ప్రాముఖ్యత కూడా కరవైందని... కాంగ్రెస్కు మేనేజ్ చేసేవాళ్లు తప్ప ప్రజాదరణ కలిగిన నేతలు అవసరం లేదని విమర్శించారు. ఎస్ఎంను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ''అదో ముగిసిన అధ్యాయం'' అంటూ ఆయన కుండబద్దలు కొట్టేశారు.
త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో... ఆయన చేరిక బీజేపీకి లాభిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







