బీజేపీలోకి ఎస్ఎం కృష్ణ!...
- February 04, 2017
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ త్వరలో బీజీపీలో చేరనున్నట్టు కర్నాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ''ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎప్పడు చేరతారన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది. అయితే ఆయన మా పార్టీలో చేరడం మాత్రం 100 శాతం ఖాయం'' అని పేర్కొన్నారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన 84 ఏళ్ల ఎస్ఎం కృష్ణ... గతవారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ పదవికి, పార్టీ సభ్యుత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్కు అత్యంత విధేయుడిగా పనిచేస్తున్నప్పటికీ.
తన వయసురీత్యా పార్టీ కార్యకలాపాల నుంచి పక్కనబెడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీలో తనకు ప్రాముఖ్యత కూడా కరవైందని... కాంగ్రెస్కు మేనేజ్ చేసేవాళ్లు తప్ప ప్రజాదరణ కలిగిన నేతలు అవసరం లేదని విమర్శించారు. ఎస్ఎంను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ''అదో ముగిసిన అధ్యాయం'' అంటూ ఆయన కుండబద్దలు కొట్టేశారు.
త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో... ఆయన చేరిక బీజేపీకి లాభిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









