'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం ట్రైలర్‌...

- February 04, 2017 , by Maagulf
'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం ట్రైలర్‌...

హైదరాబాద్‌: రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటోన్న 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. రాజ్‌తరుణ్‌ ఈ ట్రైలర్‌లో ఓ వైపు కుక్కలను కిడ్నాప్‌ చేస్తూ.. మరో పక్క ప్రియురాలి ప్రేమను పొందడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. కొన్ని గంటల ముందు విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నాలుగోస్థానంలో ఉండగా, రెండు లక్షల మందికిపైగా వీడియోను వీక్షించారు. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోందని, థియేటర్లో కలుద్దాం.. అంటూ రాజ్‌తరుణ్‌ ఆనందంతో ట్వీట్‌ చేశారు.
అను ఇమ్మానుయేల్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.
నటి హంసా నందిని ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com