తమిళనాడులో చిన్నమ్మ శశికళే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతోంది...
- February 05, 2017
అనుకున్నట్టే అయ్యింది.. తమిళనాడులో చిన్నమ్మ శశికళే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతోంది. చెన్నైలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అధికార అన్నాడీఎంకే పార్టీ సమావేశంలో ఆమెను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఇదే సమయంలో సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. తమిళనాడులో అధికార పగ్గాలను శశికళ చేపట్టేందుకు మార్గం సుగమం చేయడానికి ఆయన వెంటనే తన రాజీనామాని సమర్పించారు.
ఆమె పేరును మొదట సెల్వం ప్రతిపాదించగానే ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గవర్నర్ అపాయింట్మెంట్ని కూడా కోరడంతో ఇక శశికళ కొత్త ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఆమె వచ్చేవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







